AP: రాష్ట్రంలో రూ.39,436 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టే 31 పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేవలం విద్యుత్ రంగంలోనే 8 ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినట్లు TDP ట్వీట్ చేసింది. వీటి ద్వారా యువతకు 1,11,278 ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు పేర్కొంది. అమరావతి క్వాంటం వ్యాలీలో 3 సంస్థల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 16వ SIPB సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వివరించింది.