ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జీవోఆర్టీ నంబరు 1207 కింద 2002లో నియమితులైన 1,200 మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కోర్టు ఉత్తర్వుల కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వీరికి, రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో 2013లో తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుంది. ఈ నియామకాలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, తాజాగా ఆ నియామకాలను ఖరారు చేస్తూ జస్టిస్ అరవింద్కుమార్, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. తాజాగా ఈ 1,200 మంది నియామకాలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.