AP: యేసుక్రీస్తుపై తాను ఎప్పుడూ మాట్లాడలేదని, కానీ ఇప్పుడు జడ శ్రవణ్ ఎక్కువగా మాట్లాడుతున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. జడ శ్రవణ్ తనకు సమాధి కడతానని, నాలుక కోసి పవన్ కల్యాణ్కు పంపుతానని మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. జడ శ్రవణ్ వ్యాఖ్యలను ప్రభుత్వం సుమోటుగా తీసుకోవాలని, హిందువులు ఎవరైనా ఆయనపై ఫిర్యాదు చేయవచ్చని రఘురామకృష్ణరాజు తెలిపారు. రెండేళ్ల క్రితమే సునీల్ కుమార్ పై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.