దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో నేడు జరగనున్న గ్రాడ్యుయేషన్ పరేడ్కు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ చారిత్రాత్మక వేడుకలో తొలి ఎన్డీఏ మహిళా క్యాడెట్లు కమిషన్ అందుకోనున్నారు. ఈ సందర్భంగా సుఖోయ్, సూర్యకిరణ్, సారంగ్ విన్యాసాలతో పాటు ఆకాష్గంగా, ఎయిర్ వారియర్ డ్రిల్ టీమ్ ప్రదర్శనలు ఆకట్టుకోనున్నాయి. ఎయిర్చీఫ్ మార్షల్ ఎ.పి.సింగ్ నేతృత్వంలో ఫ్లైపాస్ట్, ఎయిర్ఫోర్స్, నేవీ, కోస్ట్ గార్డ్ ట్రైనీలకు వింగ్స్, బ్రెవెట్స్ అందజేస్తారు.