అమెరికాకు గల్ఫ్ దేశాలు సహకరించొద్దని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ హెచ్చరించారు. అణు కేంద్రాలపై దాడులు జరిగితే శత్రు స్థావరాలను భూస్థాపితం చేస్తామని, శాంతి నెలకొనాలంటే తమ నిబంధనలు పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. శత్రువులకు వత్తాసు పలికే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో హర్మూజ్ను దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలకు ఇరాన్ అనుమతినిచ్చింది. భారత్తో సహా ఐదు మిత్ర దేశాల నౌకలకు మాత్రమే ఇరాన్ అనుమతి లభించింది.