అద్దంకి నియోజకవర్గ బిసివై పార్టీ ఇంచార్జ్ మీసాల సామ్రాజ్యానికి రాష్ట్ర పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో సభ్యురాలిగా చోటు కల్పిస్తూ ఆదివారం రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సందర్భంగా సామ్రాజ్యం మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర స్థాయిలో పదవి కేటాయించిన తమ అధినేత రామచంద్ర యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ రాజ్యాంగం, లక్ష్యాలు, నియమావళి అంతఃకరణ శుద్ధితో పనిచేస్తానని ఆమె తెలియజేశారు.