బాపట్ల, రేపల్లె ప్రాంతాల్లోని 211 అంగన్వాడీ కేంద్రాలకు మంగళవారం ఇండక్షన్ స్టవ్లను పంపిణీ చేశారు. శివప్రసాద్ మాట్లాడుతూ, విద్యుత్ ఆధారిత స్టవ్లతో వంట వేగంగా పూర్తవడంతో పాటు నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయని తెలిపారు. చిన్నారులకు మెరుగైన సేవలు అందించడం, అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణే ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు.