బాపట్ల నియోజకవర్గంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. బాపట్ల పట్టణం నుండి అప్పికట్ల గ్రామం వరకు వందలాది ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 'జై కిసాన్' నినాదాలతో రహదారులన్నీ మార్మోగాయి. ఈ వేడుకలు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచాయి.