మంగళవారం గుంటూరు శ్రీ కన్వెన్షన్ లో కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ శాసనసభ ఉపసభాపతి, వైఎస్ఆర్సిపి బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త కోన రఘుపతి పాల్గొన్నారు. ఆయన బాపట్ల నియోజకవర్గం నుండి పార్టీ పరిస్థితి, రాజకీయ విశ్లేషణతో పాటు పలు అంశాలపై మాట్లాడారు.