ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. బాపట్ల పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వారు మండిపడ్డారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకుడు విన్నకోట సురేష్, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి పేరం గరుడాచలం నాయుడు, తురుసత్రం చైర్మన్ గుంటుపల్లి తులసి కుమారి ముఖ్యంగా పాల్గొని మాట్లాడారు.