రేషన్ షాపుపై దాడులు.. మూడు క్వింటాళ్ల బియ్యం స్వాధీనం

3691చూసినవారు
రేషన్ షాపుపై దాడులు.. మూడు క్వింటాళ్ల బియ్యం స్వాధీనం
బాపట్ల పట్టణం ప్యాడిసన్‌పేటలోని ఒక రేషన్ షాపులో సోమవారం సివిల్ సప్లై అధికారులు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా బాత్రూంలో అక్రమంగా దాచిపెట్టిన సుమారు మూడు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు గుర్తించారు. ఈ అక్రమ నిల్వలపై విచారణ చేపట్టి, రికార్డులతో సరిపోల్చి పరిశీలించిన అధికారులు, డీలర్‌పై నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సంఘటనతో అధికారులు నివ్వెరపోయారు.

సంబంధిత పోస్ట్