మహాకవి రాయప్రోలు సుబ్బారావు దేశభక్తి కవిత్వంతో సమాజంలో జాతీయ చైతన్యం నింపారని ఫోరం కార్యదర్శి పీసీ సాయిబాబు అన్నారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో మంగళవారం నిర్వహించిన రాయప్రోలు సుబ్బారావు 42వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన రచనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు.