చీరాల పట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. నియోజకవర్గ టిడిపి అధికార ప్రతినిధి అమర్నాథ్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ క్రియాశీల పాత్ర పోషించారని, ఆయన ఆశయాలను పౌరులందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అమర్నాథ్ ఈ సందర్భంగా తెలియజేశారు.