చీరాల అభివృద్ధిపై జగన్ తో కరణం వెంకటేష్ చర్చ

1185చూసినవారు
చీరాల అభివృద్ధిపై జగన్ తో కరణం వెంకటేష్ చర్చ
వైయస్సార్సీపి పార్టీ అధ్యక్షులు, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని బుధవారం చీరాల నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్ తాడేపల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చీరాల నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, జరుగుతున్న అభివృద్ధి పనులు, పార్టీ అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డి వెంకటేష్ తో అన్నారు.

సంబంధిత పోస్ట్