హైదరాబాద్ నుంచి చీరాలకు వెళ్తున్న మారుతి ట్రావెల్స్ బస్సు సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు మిర్యాలగూడ సమీపంలోని వేములపల్లి వద్ద ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిద్రమత్తులో బస్సును నడపడంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ బస్సు అక్కడే ఆగిపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.