చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య, నియోజకవర్గ ప్రజలు, అర్హులైన యువత ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా పునఃపరిశీలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సోమవారం చీరాల పట్టణంలోని పద్మశాలి కళ్యాణమండపంలో జరిగిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సుమారు 24 సంవత్సరాల తర్వాత భారత ఎన్నికల సంఘం ఓటరు జాబితాల సమగ్ర పునఃపరిశీలన ప్రక్రియను చేపడుతోందని, ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.