వైసీపీ అధినేత జగన్ బుధవారం గుంటూరు చేరుకుని, మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించారు. తాడేపల్లి నుంచి భారీ కాన్వాయ్తో బయలుదేరిన ఆయనకు దారిపొడవునా అభిమానులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. జగన్ కారులో నుంచే అభివాదం చేస్తూ అంబటి నివాసానికి వెళ్లారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.