గుంటూరు జిల్లా నూతన కలెక్టర్గా సీ.ఎం. సాయికాంత్ వర్మ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు గుంటూరు కలెక్టర్గా సేవలు అందించిన ఏ. తమీమ్ అన్సారియా బదిలీ అయ్యారు. ఆమెను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా ప్రభుత్వం నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పలువురు ఐఏఎస్ల బదిలీల్లో భాగంగా సీఎస్ సాయిప్రసాద్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.