
గుంటూరు: రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలి
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవి మంగళవారం పునరావాస కేంద్రాలను పరిశీలించారు. తుఫాను కారణంగా ప్రజలు రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముంపు ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రోడ్లు, డ్రైనేజీల పనులు జరుగుతున్నందున నీరు నిల్వ ఉండకుండా అధికారులకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.






































