గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ పరిధిలోని చింతలపూడి వద్ద మంగళవారం అశోక్ లేలాండ్ ఆటోలో తరలిస్తున్న 75 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం బస్తాలను పట్టణ సీఐ ఆర్ ఎస్ కిషోర్ కుమార్ సిబ్బందితో కలిసి చాకచక్యంగా స్వాధీన పరచుకొని స్టేషన్ కు తరలించారు. ఆటో డ్రైవర్ సుధీర్ బాబును అదుపులోకి తీసుకొని బియ్యం బస్తాలను ఎవరు ఇచ్చారు, ఎక్కడకు తరలిస్తున్నారు అన్నదానిపై సమగ్ర విచారణ జరుపుతున్నారు.