శుక్రవారం రేపల్లె బాపూజీ మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్, ఎం పి ఎల్ ప్రాథమిక పాఠశాలల్లో నూతనంగా చేరిన విద్యార్థులకు ఎం ఇ ఓ లు సురేష్, రత్న శేఖర్ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాభ్యాసం అందిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన
విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు.