తెనాలి ప్రభుత్వ వైద్యశాల నుంచి డిశ్చార్జ్ అయిన 50 ఏళ్ల చెంచు పేట హోటల్ కార్మికుడు, నాయుడుగా పిలువబడే వ్యక్తి సమీపంలోని రోడ్డుపై మృతి చెందాడు. స్థానికులు అతన్ని వైద్యశాలలో చేర్పించగా, ఈ నెల 7న డిశ్చార్జ్ అయ్యాడు. శనివారం పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. మృతదేహాన్ని వైద్యశాలకు తరలించామని, అతని తరపు వారు ఎవరూ రానందున దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.