ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భట్టిప్రోలు మండలంలోని సూరేపల్లి గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో, గురువారం జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. హెలిప్యాడ్, సీఎం కాన్వాయ్ మార్గం, బ్యారికేడ్లు, ప్రజా వేదిక, గ్యాలరీలు, సభా ప్రాంగణాన్ని ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు.