గత నెల 25న పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం మరిచెట్టుపాలెంలో జరిగిన కిరాణా షాపు చోరీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. వేలిముద్రల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడు తెలంగాణకు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బూస్మి శ్రీకాంత్గా గుర్తించారు. అతనిపై 32 కేసులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. సినిమా తరహా ఛేజింగ్ అనంతరం, తెలంగాణ పోలీసులు కాళ్లపై గన్ షాట్ పేల్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు.