అద్దంకి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో, వైసిపి సోషల్ మీడియా అడ్మిన్ లకు, సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం సరికాదని అన్నారు. ప్రజల కోసం మాట్లాడటం నేరమైతే, గ్రూప్ లో ఉన్న తమ సభ్యులకు నోటీసులు ఇచ్చే ముందు తనకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వైసిపి సోషల్ మీడియాపై కక్ష సాధింపులు మానుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.