బుధవారం పంగులూరు మండలం నూజిల్లపల్లి గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ లబ్ధిదారులకు 4వేల రూపాయల పెన్షన్ నగదును అందజేశారు. ఈ నెలలో కొత్త పెన్షన్లు మంజూరయ్యాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒకేసారి పెన్షన్ నగదును అందించామని మంత్రి తెలిపారు. ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.