బాపట్లలోస్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 219 జయంతి

16చూసినవారు
ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఆదివారం బాపట్ల జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ హాల్‌లో స్వాతంత్ర్య సమర యోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి జి. గంగాధర్ గౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, జిల్లాలోని బిసి సంఘాల నాయకులు పాల్గొన్నారు.