రేపల్లెలో మంగళవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రెడ్ రిబ్బన్ క్లబ్, ఇండియన్ రెడ్ క్రాస్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో తాలూకా కార్యాలయం వరకు అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాలంటీర్లు ప్రజల్లోకి వెళ్లి నినాదాలు చేస్తూ ఎయిడ్స్ నివారణపై అవగాహన కల్పించారు. రెడ్ రిబ్బన్ క్లబ్ కోఆర్డినేటర్ డా. ఎం. బుజ్జిబాబు యువతలో అవగాహన పెంపుదల అవసరాన్ని వివరించారు.