బాపట్ల మండలం సూర్యలంక గ్రామంలో శనివారం, ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ ఆదేశాల మేరకు బాపట్ల ఈగల్ టీం, మెరైన్ సిబ్బంది సంయుక్తంగా ప్రజలకు గంజాయి, ఎన్ఆర్ఎక్స్ మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్ వాడకంతో కలిగే హానికర ప్రభావాలు, వాటికి సంబంధించిన చట్టపరమైన శిక్షల గురించి వివరంగా తెలియజేశారు. డ్రగ్స్ సంబంధిత సమాచారం ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1972 పై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు.