బాపట్ల నియోజకవర్గ పరిధిలోని గ్రామాలలో మద్యం ఏరులై పారుతోందని, బెల్టుషాపుల వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బాపట్ల పార్లమెంట్ BSP ఇన్చార్జి గూడె రాజారావు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం బెల్టు దుకాణాలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గతంలో మద్యం కొనుగోలుకు ప్రభుత్వ దుకాణాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు పరిస్థితి అదుపు తప్పిందని ఆయన పేర్కొన్నారు.