బాపట్ల జిల్లాలో బుధవారం ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారి పలుచోట్ల వర్షం కురిసింది. పర్చూరు నియోజకవర్గం పరిధిలో తేలికపాటి జల్లులు, బల్లికురవ, అద్దంకి ప్రాంతాల్లోనూ చిరుజల్లులు ప్రజలను తడిపాయి. గత నాలుగు రోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఊరటనిచ్చింది. అయితే, ఉదయాన్నే పనులకు బయలుదేరిన వారు వర్షంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.