యద్దనపూడి మండలంలోని అనంతవరం గ్రామంలో శనివారం కుంచాల వీరకుమారి (27) అనే యువతి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన వీరకుమారికి వివాహం చేయాలనే ప్రయత్నాల్లో భాగంగా సంబంధాలు చూస్తున్నారని, దీనిపై మనస్తాపం చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసినట్లు యద్దనపూడి ఎస్ఐ రత్నకుమారి తెలిపారు.