బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. గ్రీవెన్స్ సెల్ లో అర్జీ ఇవ్వడానికి వచ్చిన గుర్తుతెలియని యువకుడు పురుగుమందు తాగి అక్కడికక్కడే కుప్పకూలాడు. తోటి అర్జీదారులు, సిబ్బంది వెంటనే స్పందించి అతన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.