చిలకలూరిపేట మండలం అకాల వర్షాలు, తుఫానుల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, వారికి న్యాయమైన నష్టపరిహారం అందించాలని వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ (
వైసీపీ) మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్చార్జి విడదల రజిని డిమాండ్ చేశారు. గురువారం ఆమె రైతులను సందర్శించి, దెబ్బతిన్న మొక్కజొన్న పంటను పరిశీలించారు. రైతులు పండించిన మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతిని, మొలకెత్తిన కంకులను ఆమెకు చూపించారు.