శుక్రవారం చిలకలూరిపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. బొప్పుడి, దండమూడి, ఈవూరివారిపాలెం, ఎడ్లపాడు, మానుకొండవారిపాలెం గ్రామాల ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను తీర్చడానికి తాము, అధికారులు ఉన్నారని, అధికారులతో మాట్లాడి పరిష్కారం అయ్యే దిశగా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.