ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీలు సోమవారం శాసనమండలి ఛైర్మన్ను కలిసి తమ రాజీనామాలను సమర్పించారు. మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, కల్యాణ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణ, జాకియా ఖానం, పోతుల సునీతలు తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాలని ఛైర్మన్ను కోరారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.