అమ్మకాలు నిలిపితే కఠిన చర్యలు: తహశీల్దార్ హెచ్చరిక

2206చూసినవారు
చిలకలూరిపేటలో డీజిల్ కొరతపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని తహశీల్దార్ మహమ్మద్ హుస్సేన్ తెలిపారు. సోమవారం పలు పెట్రోల్ బంకులను తనిఖీ చేసిన ఆయన, జిల్లాలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని స్పష్టం చేశారు. కృత్రిమ కొరత సృష్టించడం లేదా విక్రయాలు నిలిపివేస్తే బంకులను సీజ్ చేసి లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. వినియోగదారులు ఎటువంటి ఇబ్బందులు ఎదురైతే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

సంబంధిత పోస్ట్