
ఇక సిమ్ ఉన్న ఫోన్ లోనే వాట్సాప్ లాగిన్
స్కామ్ కాల్స్, మెసేజింగ్ మోసాలను అరికట్టేందుకు టెలికం శాఖ కొత్త కఠిన మార్గదర్శకాలు ప్రకటించింది. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ ప్లాట్ఫార్మ్స్ను తప్పుగా వినియోగించకుండా ఉండడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యం. ఒక నంబర్తో ఉన్న సిమ్ ఏ ఫోన్లో పని చేస్తుందో, అదే ఫోన్లో మాత్రమే ఆ నంబర్కు సంబంధించిన వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్లు రన్ అవుతాయి. సిమ్ను తొలగించిన వెంటనే ఆ యాప్ కూడా ఆటోమేటిక్గా పనిచేయడం ఆగిపోతుంది.




