మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని చీరాల డిఎస్పి ఎం. డి. మోయిన్ తెలిపారు. మంగళవారం వేటపాలెంలో జరిగిన ‘ఉమెన్ సేఫ్టీ మాదకద్రవ్యాల నిరోధం’పై అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది మహిళలు, ఆశా వర్కర్లు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు సాంకేతికతను ఉపయోగించుకోవాలని డిఎస్పి సూచించారు.