Apr 13, 2026, 00:04 IST/
గ్యాస్ కొరత.. 5 కేజీల సిలిండర్ల సరఫరా భారీగా పెంపు
Apr 13, 2026, 00:04 IST
గ్యాస్ కొరతను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం 5 కేజీల LPG సిలిండర్ల సరఫరాను భారీగా పెంచింది. మార్చి 23 నుంచి ఇప్పటివరకు 13 లక్షలకు పైగా సిలిండర్లను విక్రయించింది. ప్రస్తుతం రోజువారీ అమ్మకాలు లక్ష యూనిట్లను దాటుతున్నాయి. ముఖ్యంగా వలస కార్మికులు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మార్చి నుంచి 4.24 లక్షల PNG కనెక్షన్లను కూడా ప్రభుత్వం యాక్టివేట్ చేసింది. దేశీయ LPG సరఫరా స్థిరంగా కొనసాగుతోంది. ఈ నెల 11వ తేదీన 52 లక్షల సిలిండర్లు డెలివరీ అయ్యాయి.