వ్యవసాయ విద్యలో కెరీర్ కోరుకునే విద్యార్థులకు ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక శుభవార్త అందించింది. 2026-27 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ అగ్రి పాలిటెక్నిక్ కళాశాలల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. రెండేళ్ల కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునేవారు ఈ నెల 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ రిజిస్ట్రార్ మణి సూచించారు. పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన
విద్యార్థులు ఈ ప్రవేశాలకు అర్హులు. మరిన్ని వివరాల కోసం విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.