గుంటూరు గోరంట్ల గ్రామానికి చెందిన హరి, రమాదేవి దంపతులకు ఇద్దరు మగ పిల్లలున్నారు. పుట్టుకతోనే మస్కులోటిస్ వ్యాధితో బాధపడుతున్న వీరిద్దరూ వీల్ చైర్ కే పరిమితమయ్యారు. తమకు ఎవరు ఇల్లు అద్దెకి ఇవ్వడం లేదని, భర్త కష్టపడితేనే కుటుంబం గడుస్తుందని బాధ్యతలు వాపోయారు. గతంలో టిడ్కో గృహాలకు దరఖాస్తు చేసుకున్నా తిరస్కరణకు గురైందని తెలిపారు. మంత్రి లోకేష్ తమపై దయచూపి ఒక ఇల్లు మంజూరు చేయాలని వారు కోరారు.