నగరపాలక సంస్థకు వచ్చే ఫిర్యాదులు, అర్జీలు పునరావృతం కాకుండా గడువులోగా పరిష్కరించాలని కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో 21 ఫిర్యాదులు రాగా, వాటిని వివిధ విభాగాల అధికారులకు పంపి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలో మేయర్తో కలిసి 21 అర్జీలు స్వీకరించిన అనంతరం, క్షేత్రస్థాయి అధికారులు అందుబాటులో ఉండి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు.