గుంటూరులో ఎండల తీవ్రత పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం వాతావరణం కాస్త చల్లబడినప్పటికీ, గురువారం అనూహ్యంగా ఎండలు పెరిగాయి. ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వేసవి తాపం నుండి ఉపశమనం కోసం చల్లటి పదార్థాలు తీసుకుంటున్నారు. అత్యవసర పనుల నిమిత్తం బయటకు వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.