బాపట్ల సూర్యలంక బీచ్ను నవంబర్ 4, 5 తేదీలలో (మంగళవారం, బుధవారం) తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు RDO తెలిపారు. తుఫాను కారణంగా సముద్రంలో ఏర్పడిన గుంటల నేపథ్యంలో, భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు పర్యాటకులను అనుమతించడం లేదని పేర్కొన్నారు. తదుపరి భద్రతా పరిశీలనల తర్వాతే బీచ్ను తిరిగి తెరిచే అవకాశం ఉందని, దీంతో ఈసారి ఉమ్మడి గుంటూరు ప్రజలకు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానం చేసే అవకాశం లేదని సమాచారం.