కొండా వెంకటప్పయ్య కాలనీకి చెందిన పార్వతి (60) అనే వృద్ధురాలు గ్యాస్ పొయ్యిపై నీళ్లు వెచ్చబెడుతుండగా అగ్నిప్రమాదంలో గాయపడి, ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నగరంపాలెం ఠాణాలో శనివారం కేసు నమోదైంది. గత నెల 22న ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.