గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి గురువారం మొంథా తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఏటి అగ్రహారం ప్రాంతంలోని రేషన్ షాపు వద్ద బాధితులకు బియ్యం, పప్పు, నూనె, కూరగాయలు, పంచదార, ఉల్లిపాయలు వంటివి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలు తుఫానును సమర్ధవంతంగా ఎదుర్కొన్నారని తెలిపారు.