మాచవరం మండలం మొర్జంపాడు గ్రామంలోని భ్రమరాంబ సమేత బుగ్గ మల్లేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శివలింగానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ శాసన ధర్మకర్తలు మండాది వంశీయులు భక్తులకు ఉచిత ప్రసాదాలు అందజేశారు.