రాష్ట్రంలో డీజిల్ కొరతపై టీడీపీపై ఆరోపణలు

5చూసినవారు
మాచర్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ యరమల రామచంద్ర రెడ్డి ఆదివారం మాచర్లలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కొనసాగుతున్న డీజిల్ కొరతకు టీడీపీ నాయకులే కారణమని ఆరోపించారు. గత కొన్ని రోజులుగా ఏర్పడిన ఇంధన సమస్య వెనుక అనధికారిక డీజిల్ దందా ఉందని విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి లేదని, మన రాష్ట్రంలోనే కొరత తలెత్తడం అనుమానాస్పదమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి నిజాలను వెలుగులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్