మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో, ఆయన మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి, కాసు మహేష్ రెడ్డిలపై ధ్వజమెత్తారు. కాసు కుటుంబం ఒకరు చనిపోతే సమాధి కట్టడానికి చందాలు వసూలు చేసిన చరిత్ర కలిగి ఉందని విమర్శించారు. ఎమ్మెల్యే జూలకంటి, కాసు కుటుంబ చరిత్రను తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.